Home Blog

291వ వారానికి చేరిన సంగెం ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం 

0

291వ వారానికి చేరిన సంగెం ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: డా.సుధీర్ కుమార్ న్యాయవాది, సంగెం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన మహాయజ్ఞం 291వ వారానికి చేరింది. కరోనా కష్టకాలం నుండి తన తల్లి సంగెం గిర్మాబాయి పేరు మీద పేద ప్రజలకు ప్రతి ఆదివారం అన్నదానం చేస్తున్నారు. ఈ వారం అన్నదాన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా హెడ్ కానిస్టేబుల్ పంభాల లింగమూర్తి హాజరయ్యారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొమ్మెత సుభాష్, భీమాకంటి అంబయ్య, డోంగరి గంగయ్య, సలీం, మహేందర్ రెడ్డి, నరేందర్ న్యాయవాది, రాజయ్య కేశవేణి తదితరులు పాల్గొన్నారు.

 ఆదిలాబాద్ లో కళా అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయం : దుర్గం శేఖర్

0

*కళా అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివారం పట్టణంలో కళా అకాడమీ ప్రారంభమై నాలుగు నెలలు పూర్తికావడంతో తొలి బ్యాచ్ విద్యార్థుల కోర్సు పూర్తయిన సందర్భంగా సర్టిఫికెట్ల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెల్పి సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్‌లో మా స్వగ్రామం అయిన ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామ మిత్రుడు గణేశ్ కుమార్తె వైష్ణవి గొప్ప ఆలోచనతో ఈ కళా అకాడమీని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాల్లో అందుబాటులో ఉండే ఇలాంటి అకాడమీని ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. వైష్ణవి నైపుణ్యానికి పెద్ద కంపెనీలలో  అవకాశాలను అన్ని వదులుకొని సొంత ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషమన్నారు.

ఆదిలాబాద్ జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా యువతీ, యువకులు కొత్త నైపుణ్యాలను నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ పరమేశ్వర్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, అమన్ ఫౌండేషన్ చైర్మన్ అరఫాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: సీఐ దీపక్

0

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: సీఐ దీపక్

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) దీపక్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల పరిధిలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు (డ్రంక్ అండ్ డ్రైవ్) నిర్వహించారు.

​ఈ సందర్భంగా సీఐ దీపక్ మాట్లాడుతూ..మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకే ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

తాగి వాహనం నడిపితే భారీ జరిమానాతో పాటు కోర్టు ద్వారా జైలు శిక్ష పడే అవకాశం ఉందని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వాహనదారులు ప్రయాణాల్లో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు. ​రోడ్లపై శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రమాదాల అడ్డుకట్టకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీఐ దీపక్, స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

లాడ్జీలు, దాబాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

0

 లాడ్జీలు, దాబాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లాబాసర మండల కేంద్రంలో  పలు లాడ్జీలు, దాబాలలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, ఆదేశాల మేరకు ముథోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర సీఐ దీపక్ ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జీల నిర్వాహకులు నిర్వహిస్తున్న రిజిస్టర్లను, వచ్చిపోయే వారి వివరాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా సీఐ దీపక్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. లాడ్జీలకు వచ్చేవారి ఆధార్ కార్డు, ఇతర అధికారిక గుర్తింపు కార్డులు (ID Proofs) తీసుకున్న తర్వాతే గదులు కేటాయించాలన్నారు. సీసీ కెమెరాల నిర్వహణ, ప్రతీ లాడ్జీ, దాబా వద్ద సిసి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, అవి 24 గంటలు పనిచేసేలా చూడాలని స్పష్టం చేశారు. అపరిచిత,  అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దాబాల వద్ద మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: సీఐ దీపక్ 

0

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: సీఐ దీపక్ 

చిత్రం న్యూస్ బాసర : నిర్మల్ జిల్లా బాసర మండల పరిధిలోని గ్రామీణ ప్రాంత ప్రజలు, వినాయక మండపాల నిర్వాహకులు చట్ట నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ దీపక్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మండప నిర్వాహకులకు సూచించారు.మండలంలోని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే ప్రతీ గణేష్ మండపానికి సంబంధిత మీ సేవ (Meeseva) కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకుని పోలీసు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. విద్యుత్,అగ్నిమాపక భద్రత,విద్యుత్ లైన్లకు అంతరాయం కలగకుండా, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉత్సవాల్లో డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్‌ను ఉపయోగించడం పూర్తి నిషేధమని, నిర్ణీత  సమయంలోనే సౌండ్ బాక్సులను ఉపయోగించాలన్నారు.

​శాంతిభద్రతల పరిరక్షణ, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు పర్యవేక్షించాలన్నారు. మద్యపానం, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదని, ​గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో పండగ జరుపుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు స్థానిక పోలీసులకు గ్రామస్థులు, నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు,ప్రజా ప్రతినిధులు , ఆయా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం: మాజీ మంత్రి జోగు రామన్న

0

మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం: మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, జైనథ్: యావత్ రైతాంగం కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా ఉందని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రైతులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకోవడం తనను ఎంతగానో ఆనందపరిచిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ, కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలతో బసవన్నలను అలంకరించి రైతులు తమ అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. శనివారం మాజీ మంత్రి జోగు రామన్న కరంజి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు, మహిళలు జోగు రామన్నను మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులను ఆత్మీయంగా కలుసుకుని పలకరించారు. పొలాల పండుగ సందర్భంగా “రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి” అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన రైతులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం దళిత బస్తీ, దళిత బంధు వంటి పథకాలను అమలు చేశారని, రూ.10 లక్షల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బస్తీ పథకం ద్వారా కేటాయించిన భూముల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం బోర్లు వేయకపోవడం అమానుషమని విమర్శించారు. ప్రతి చేనుకు బోరు సౌకర్యం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన బోర్లను ఇప్పటివరకు రైతుల చేలల్లో వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు, రైతుబీమా, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండించారు. వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని, వ్యవసాయంపై ఉన్న మక్కువతోనే కేసీఆర్ తన నివాసాన్ని పంట పొలాల మధ్య నిర్మించుకున్నారని పేర్కొన్నారు. రైతాంగానికి అండగా నిలిచిన కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం కొనసాగిస్తే రానున్న రోజుల్లో రైతుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని జోగు రామన్న హెచ్చరించారు.

అడవిపంది ఢీకొని యువకుడు మృతి

0

బేల మండలంలో విషాదం 

చిత్రం న్యూస్, బేల: బేల మండలం సిర్నన్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అడవిపంది అడ్డురావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సిర్నన్న గ్రామానికి చెందిన ఆకాష్ గా గుర్తించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా అడవిపంది రోడ్డుపైకి రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆకాష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలో యువకుడి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.

పడిపోయిన గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్స్

0

పడిపోయిన గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్స్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బెదోడ గ్రామానికి చెందిన మధుకర్ గోడే, తండ్రి గంపా(గణపత్)గోడే వ్యవసాయ భూమికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్స్ పడిపోయాయి. బెదోడ నుండి బేలకు వచ్చే దారిలో 1/8/2026 రోజున ఉదయం 10 గంటల సమయంలో పడిపోయాయి. సదరు డాక్యుమెంట్స్ ఎవరికైనా లభిస్తే తమను సంప్రదించలన్నారు.

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు 

0

బాధిత కుటుంబానికి అశోక్ నగర్ సేవా సమితి రూ.36 వేల ఆర్థిక సాయం అందజేత 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఇంద్ర నగర్ కాలనీకి చెందిన పెగల్వార్ యోగేష్ భార్య సువర్ణ గత సంవత్సరం నుంచి చిన్నపేగు సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.వైద్య చికిత్స కోసం ఇప్పటివరకు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబం ఫ్రూట్స్ దుకాణంపై ఆధారపడి జీవనం సాగిస్తుండటంతో, అనారోగ్యంతో బాధపడుతున్న సువర్ణ చికిత్సకు మరింత ఆర్థిక సాయం అవసరమైంది. ఈ పరిస్థితిని తెలుసుకున్న అశోక్ నగర్ కాలనీ సేవా సమితి సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబానికి రూ.36 వేలు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. సువర్ణకు ముగ్గురు కుమార్తెలు,ఓ కుమారుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స కొనసాగించేందుకు సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి సేవా సమితి సభ్యులు అందించిన సహాయం ఎంతో ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న సువర్ణకు మరింత మంది దాతలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని కోరుతున్నారు.

దళితులను అవమానించే చర్యలపై జైనథ్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

0

దళితులను అవమానించే చర్యలపై జైనథ్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

చిత్రం న్యూస్, జైనథ్: దళిత నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం జరిగిన ప్రాంతాన్ని ‘శుద్ధి’ పేరుతో పాలతో కడగడం, పసుపు నీళ్లు చల్లడం వంటి చర్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జైనథ్ పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రావణ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ల ఆదేశాల మేరకు, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జైనథ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. దళితులను అవమానించేలా, అంటరానితనాన్ని ప్రోత్సహించేలా ఉన్న ఇటువంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నిరంతరం పోరాడుతుందని దుర్గం శేఖర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ రాహుల్ చంద్రాల, జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, డీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ శివాజీ, సెక్రటరీ లింగన్న, సెక్రటరీ బిక్కి గంగన్న, బేల మండల అధ్యక్షుడు మందాకిని ప్రభాకర్, జైనథ్ మండల అధ్యక్షుడు కోడిచెర్ల పోచన్న, కోడిచెర్ల లస్మన్న, ఎస్సీ డిపార్ట్‌మెంట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.