Home Blog

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతికి యాజమాన్యమే కారణం: పల్లపు తులసీరామ్

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోనీ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మల్లిపూడు తేజస్వని మృతికి యూనివర్సిటీ యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ ఆరోపించారు. విద్యార్థినికి సకాలంలో సరైన వైద్యం అందించడంలో యూనివర్సిటీ యంత్రాంగం విఫలమైందని ఆయన విమర్శించారు.అత్యవసర పరిస్థితుల్లో పెద్ద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలనే స్పృహ కూడా వీసీకి లేదని, టెక్నికల్ అంశాలపైనే దృష్టి సారించి, విద్యార్థి ప్రాణాలను బలిగొన్నారని రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.వ్యక్తిగత లబ్ధి, డబ్బు సంపాదన పక్కన పెట్టి, విద్యార్థుల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయాలని, మెరుగైన వైద్య పరికరాలు, అర్హత కలిగిన వైద్యులను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

ప్రయోజనం పొందాలనే ఆశతో బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చిన విద్యార్థులు శవాలుగా తిరిగి వెళ్లడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. మరణించిన విద్యార్థిని మల్లిపూడు తేజస్విని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీని నడిపే సామర్థ్యం లేకపోతే వీసీ వెంటనే రాజీనామా చేయాలన్నారు. మెస్ కాంట్రాక్టులు తీసుకున్న వారికి రక్షణ కల్పించే వీసీ, విద్యార్థుల ప్రాణాల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే ముసుగు తొలగించి, బాసర ట్రిపుల్ ఐటీని కాపాడుకుంటామని ఆయన హెచ్చరించారు.

దేశాభివృద్ధికి జనగణన అత్యంత కీలకం: కలెక్టర్ అభిలాష అభినవ్

0

చిత్రం న్యూస్, నిర్మల్: దేశాభివృద్ధికి జనగణన ప్రక్రియ అత్యంత కీలకమని, దీని ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భారత జనాభా గణన–2027 కార్యక్రమానికి సంబంధించి అధికారులకు మంగళవారం కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు.జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనగణన ఆధారంగానే ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రజా ప్రయోజనాల రూపకల్పన జరుగుతుందని తెలిపారు.గృహాల గుర్తింపు, జనగణన వివరాల నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. మాస్టర్ ట్రైనర్లు అందించే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. జనగణన ప్రక్రియను బాధ్యతగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీఓ జీవరత్నం, డీపీ,వో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్జీయూకేటీ బాసర విద్యార్థిని తేజస్విని మృతి పట్ల సంతాపం

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పి.యు.సి రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మల్లిపూడు తేజస్విని మరణం పట్ల విశ్వవిద్యాలయ యంత్రాంగం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.​ మెదక్ జిల్లా రామచంద్రాపురం నివాసి అయిన తేజస్విని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం నిమిత్తం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. గత కొన్ని నెలల నుంచి తేజస్విని ఇంటిదగ్గరే చికిత్స తీసుకుంటున్నారు. తేజస్విని మృతి పట్ల తోటి విద్యార్థులు, విశ్వవిద్యాలయం అధికారులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ​వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన

చిత్రం న్యూస్ కాగజ్ నగర్ : ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజాలైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చిన 22 మందిని పరీక్షించగా అందులో 14 గురికి ఆపరేషన్ అవసరమని వారికి విడతల వారిగా ఆపరేషన్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించబడునని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ శాసనసభ్యులు, ఫౌండేషన్ అధ్యక్షులు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.

తరోడ పల్లె దవాఖానలో వైద్యుడిని నియమించాలి 

0

చిత్రం న్యూస్ ముథోల్ : నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఉన్న పల్లె దవాఖానలో సరైన వైద్య సేవలు అందడం లేదని, అక్కడ డాక్టర్‌ను వెంటనే నియమించాలని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గడిపల పరమేష్ డిమాండ్ చేశారు.గ్రామంలోని పల్లె దవాఖాన కేవలం పేరుకే పరిమితమైందని, నెలలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే తెరిచి, అదీ గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయడానికి మాత్రమే వినియోగిస్తున్నారని పరమేష్ విమర్శించారు. దీనివల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలోని పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. దవాఖానలో ఎంబీబీఎస్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, ఆశా వర్కర్లే వైద్య సేవలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని, అత్యవసర సమయంలో వైద్య సహాయం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.  వైద్యం కోసం వృద్ధులు, గర్భిణులు ఉన్నప్పటికీ వారికి సకాలంలో వైద్యం అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పరమేష్ అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి  తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. తరోడ పల్లె దవాఖానలో శాశ్వత ప్రాతిపదికన డాక్టర్‌ను నియమించి, ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

నిర్మల్ జిల్లాలో గ్యాస్ గోదాం తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

0

చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఇండేన్ గ్యాస్ సిలిండర్ల గోదాంను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మంగళవారం సందర్శించారు. గోదాంలో గ్యాస్ సిలిండర్ల నిల్వ, భద్రతా ప్రమాణాలు, సరఫరా విధానం వంటి అంశాలను వారు సమీక్షించారు. వినియోగదారులకు ఎలాంటి అంతరాయాలు లేకుండా సిలిండర్లు అందాలని సూచించారు. గోదాం సందర్శన అనంతరం, అక్కడికి వచ్చిన గ్యాస్ వినియోగదారులతో అధికారులు నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సరఫరాలో జాప్యం లేదా ఇబ్బందులు తలెత్తితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్, ఎస్పీ హెచ్చరించారు. వినియోగదారులకు సమయానికి సిలిండర్లు అందేలా చూడాలని ఆదేశించారు.గ్యాస్ పంపిణీలో అక్రమాలు జరగకుండా పటిష్టమైన నిఘా కొనసాగించాలని మండల అధికారులకు సూచించారు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తహసీల్దార్ సంధ్యా రాణి, ఎస్.ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయాలని తహసీల్దార్ కు బీజేపీ నేతల వినతి

0

చిత్రం న్యూస్, నిర్మల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ లో మంగళవారం మండల బీజేపీ అధ్యక్షుడు కాల్వ నరేష్, నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు ఆరు గ్యారంటీలను, 420 హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు.

ప్రస్తుత బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించి, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా కొత్త పెన్షన్లు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం వంటి పథకాలకు వెంటనే నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, తక్షణమే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన వ్యవసాయ కార్మిక సంఘం నేతలు 

0

చిత్రం న్యూస్ నిర్మల్ : నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, కొలతలు లేకుండా డబ్బులు చెల్లించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలకు రూ.800 కూలీ చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, పనిముట్లు గడ్డపార తట్టా పారా కొనుగోలు చేసి ఇవ్వాలని, పని ప్రదేశాలలో టెంట్ సౌకర్యంకల్పించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి పనులను ఎగ్గొట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ చట్టం తెచ్చిందన్నారు .కేంద్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే చెల్లిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం 40% చెల్లించాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ భారాన్ని మోయలేదని ఉపాధి హామీ పని దానికి అదే బంద్ అవుతుందని బీజేపీ సర్కార్ ఈ చట్టాన్నీ తీసుక వచ్చిందన్నారు. తక్కువ బడ్జెట్ కేటాయించి ఎక్కువ రోజులు పని ఎలా కల్పిస్తారు. 125 రోజులు పని కల్పిస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అన్నారు . నరేంద్ర మోడీ సర్కార్ కు రైతులు పేదలు, వ్యవసాయ కూలీలు కార్మికులంటే ఎలర్జీ అన్నారు. అందుకే కొత్త కొత్త చట్టాలను తీసుకువచ్చి ప్రజలకు నష్టం చేస్తుందన్నారు. ఈ చట్టం అమల్లోకి ఏప్రిల్ ఫస్ట్ నుండి రానుందని,ఈ చట్టం ద్వారా వ్యవసాయ కూలీలు పని అడిగే హక్కుని కోల్పోతున్నారు. వీబీజీ రాంజీ చట్టం రద్దుకై దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు బర్కుంట గంగారం, నిర్మల్ మండల కన్వీనర్ సుంకరి లక్ష్మి, కో కన్వీనర్ భాగ్యశ్రీ ,సోన్ మండల కన్వీనర్ *బక్కూరి రవీందర్, కొండాపూర్ గ్రామ ఉపాధి హామీ కూలి సంఘం నాయకులు ఎల్లుల్ల శ్రీనివాస్, అల్లం గంగాధర్, మంద పోశెట్టి, మహిళా కూలీలు పాల్గొన్నారు .

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్ అభిలాష అభినవ్

0

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. అన్ని గ్యాస్ ఏజెన్సీలలో తగినంత గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నవారికి నిర్ణీత సమయంలోపల సిలిండర్లను ప్రజలకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. ప్రజలకు ఎవరికైనా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు కలిగితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు 91005 77132 ను సంప్రదించవచ్చునని వివరించారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల ఏజెన్సీ లతో సమావేశం నిర్వహించి, ప్రజలకు సరిపడినన్ని సిలిండర్లను సాఫీగా పంపిణీ చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరు గ్యాస్ కొరత అని వస్తున్న అసత్య వార్తలను, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పై అపోహలు వీడాలి : జిల్లా వైద్యాధికారి రాజేందర్ 

0

చిత్రం న్యూస్, నిర్మల్ : గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ పాపిల్లో వైరస్ (హెచ్‌పీవీ ) వ్యాక్సినేషన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు వీడాలని నిర్మల్ జిల్లా వైద్యాధికారి డా.రాజేందర్ సూచించారు. జామ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ఒక ప్రధాన సమస్యగా మారిందని డాక్టర్ రాజేందర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ క్యాన్సర్‌ను నివారించడానికి ప్రభుత్వం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ఉచితంగా అందిస్తోందని తెలిపారు.ఈ వ్యాక్సిన్ 14 ఏళ్లు నిండిన బాలికలకు, 15 ఏళ్ల లోపు వారికి ఉద్దేశించబడిందన్నారు. అర్హులైన బాలికలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే జాబితాలను సిద్ధం చేసిందని, త్వరలోనే వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ను ఖరారు చేసి అమలు చేస్తామని ఆయన వివరించారు.ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అర్హులైన బాలికల జాబితాలు తయారు చేయబడ్డాయని, త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేసి అందరికీ వ్యాక్సిన్ అందిస్తామన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో ప వన్, ప్రోగ్రాం అధికారి సౌమ్య, పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.