మడావి రూప్ దేవ్ కుటుంబానికి రూ.85 వేలు ఆర్థికసాయం అందజేత
చిత్రం న్యూస్, నార్నూర్: నార్నూర్ మండలం బాబేఝారీ గ్రామంనికి చెందిన నిరుపేద విద్యార్థి మడావి రూప్ దేవ్ తండ్రి రాజు, తల్లి లక్ష్మిబాయి కిడ్నీ స్టోన్ తో బాధపడుతున్న సమయంలో రూప్ దేవ్ కుటుంబం సభ్యులకు ధైర్యం ఇస్తూ అండగా నిలిచారు అభిమన్యు సభ్యులు. విద్య, వైద్యం, పేదల కోసం ఎల్లప్పుడూ నిరంతరం సహాయసహకారాలు అందిస్తూ అండగా ఉంటామని గ్రూప్ సభ్యుడు మెస్రం శేఖర్ బాబు అన్నారు. దాతలు అందజేసిన రూ. 85 వేల నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పెందోర్ దాదిరావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, సామాజిక సేవకుడు, ఉపాధ్యాయుడు మెస్రం లింగు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు మడావి చంద్రహరీ, రాజ్ గోండు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కుంరం చత్రుశావ్, జిల్లా నాయకులు మరప గంగారాం, ఆదివాసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు పెందోర్ మధు, మరప గంగారాం, విద్యార్థి సంఘం నాయకులు మెస్రం కేశోరావు, కోట్నాక్ శ్రీరామ్, ఆత్రం అజేయ్, తుంరం సంతోష్, గ్రామ పటేల్ మాడావి లింగు, నూతన సర్పంచ్ పెందోర్ లింగు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.